బియ్యం కడిగిన నీళ్ళు, గంజి అమృతమే..! | Health & Beauty Benefits of Rice Water | VantintiChitkalu

గంజి చేసే మేలు

గంజి నీళ్ళు.. మన ఆరోగ్యానికి చక్కగా పనిచేస్తాయి. ఇది శరీరానికి అవసరమయ్యే శక్తిని అందించడంలో మంచి పాత్ర పోషిస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు సౌందర్యం ఈ గంజితో సాధ్యమవుతుంది. బియ్యం ఉడకబెట్టి వార్చిన నీరే గంజి. ఎక్కువ నీళ్లు పోసి బియ్యాన్ని బాగా ఉడకబెట్టాలి. అలా బియ్యం ఉడుకుతున్నప్పుడే నీటిని వేరు చేయాలి. లేదా అన్నం ఉడకగానే మిగిలిన నీటిని పాత్రలోకి వార్చాలి. ఈ గంజిని వేడిగానైనా, చల్లారకనైనా తీసుకోవచ్చు. రుచికి ఉప్పు, పిప్పర్ పౌడర్ జోడించవచ్చు. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్‌ శరీరానికి తక్షణం శక్తిని చేకూరుస్తాయి. మనసు ప్రశాంతంగా మారి, ఏకాగ్రతను పెంచేలా చేస్తాయి. శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి.

సౌందర్య పోషణలో..
- రైస్‌వాటర్‌తో ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల, క్లెన్సింగ్‌ ఎఫెక్ట్‌ పొందవచ్చు.
  జిడ్డు, మొటిమలు, మచ్చలు తొలగిపోవడంతో పాటు ముఖ వర్చస్సు ఇనుమడింప చేస్తుంది.
- బియ్యం కడిగిన నీటిని జుట్టుకి బాగా పట్టించి కాసేపయ్యాక శుభ్రం చేసుకుంటే కురులు పట్టుకుచ్చులా మారతాయి.
- స్నానం చేసే నీటిలో బియ్యం కడిగిన నీటిని చేర్చడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. 

No comments: