పండ్లు శుభ్రంగా కడగాలి | Simple tricks to remove Pesticides from Fruits | VantintiChitkalu

తొక్క ఉన్న పండ్ల విషయంలో కూడా జాగ్రత్త..!
ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎమరపాటు వహించక మార్కెట్లో కొని తెచ్చిన పండ్లని విధిగా సరైన పద్ధతిలో శుభ్రం చేసుకుని ఆరగించాలి. అదేలాగో వంటింటి చిట్కాలు చూద్దాం..- ధారగా వస్తున్న నీటిలో పండ్లు శుభ్రంగా కడగాలి. దీనివల్ల విషరసాయనాలతో పాటు నిగనిగలాడడానికి పూసిన రంగులు, నూనెలు వగైరా దూరమవుతాయి.
- గోరువెచ్చటి నీళ్లలో పూర్తిగా పండ్లు కాసేపు ఉంచి కడగడంతో తొందరగా మళినాలు వదిలే అవకాశముంది.
- కాస్త ఉప్ఫు లేదా కొద్దిగా నిమ్మరసం కలిపిన నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది.
- ఐదు నుంచి పది నిమిషాల పాటు మంచి నీళ్లలో మునిగేలా ఉంచి చక్కగా రుద్ది కడిగి పొడిగా తుడిచాకే  పండ్లని తినాలి.
- పండ్లు పగుళ్లున్నా, దెబ్బతగిలినా తినకూడదు. పగుళ్లతో పండ్ల లోపలికి వెళ్లిన రసాయనాలు మన ఆరోగ్యానికి ఎక్కువ ముప్పు తెస్తాయి.
- కుళ్లిపోయిన పండ్లు, రసాయనాలు పొడిరూపంలో పైన కనిపించిన పండ్ల జోలికి పొరపాటున కూడా వెళ్లకూడదు. ఇది అత్యంత ప్రమాదకరమని గుర్తించాలి.
- గది ఉష్ణోగ్రతలకు మించి లేదా రిఫ్రిజిరేటర్లో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన పండ్లు విషతుల్యమే.
- అరటి, కమలా, బత్తాయి వంటి తొక్క ఉన్న పండ్ల విషయంలో కూడా జాగ్రత్తలవసరం.

No comments: