సర్వేంద్రియానాం.. నయనం ప్రధానం.. | నేడే ప్రపంచ దృష్టి దినోత్సవం | World Sight Day | | VantintiChitkalu

కళ్ళు - ఆరోగ్యం

అంధత్వ సమస్యలపై ప్రజలను జాగృతం చేసే దిశగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండో గురువారం నాడు ‘ప్రపంచ దృష్టి దినోత్సవం’ నిర్వహిస్తోంది. కంటి ఆరోగ్యం కోసం విటమిన్ - ఎ, విటమిన్ - సి, విటమిన్ - ఇ ఉన్న ఆహారపదార్థాలను తప్పక తీసుకోవాలి. అంటే పచ్చని ఆకుకూరలు, కూరగాయలు, బొప్పాయి, టమాట, క్యారట్, చేపలు.. వీటిల్లో ఈ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రతిరోజు మన ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడితే కళ్లు ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఎక్కువగా మంచి నీటిని తీసుకోవడం వల్ల కూడా కంటికి మేలు జరుగుతుంది. అలాగే కంటికి సరిపడా నిద్ర, విశ్రాంతి అవసరం. ఇక సంవత్సరంలో ఒక్కసారైనా తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవడంలో అశ్రద్ద తగదు.


No comments: