ప్లాస్టిక్ ముప్పని తెలిసినా.. | From Gudi Padwa, Plastics are Banned in Maharashtra

ప్లాస్టిక్ వాడకంతో మానవాళి ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. వాతావరణ కాలుష్యంతో సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాలవల్ల భూమిని కాపాడే ఓజోన్‌ పొరకు భారీస్ధాయి నష్టం వాటిల్లుతుంది. కారణంగా భూమి పైన ఉన్న మానవాళికి, జీవరాశికి శ్వాస, చర్మ, సంబంధిత వ్యాధులు ప్రభలుతాయి. అంతేకాకుండా పశుపక్షాదులకు ప్లాస్టిక్ వల్ల ప్రాణహని ఉంది. ఏటా లక్ష క్షీరదాలు పక్షలు ప్లాస్టిక్ కారణంగా మరణిస్తున్నాయి. చెరువుల్లో, నదుల్లో ఈ వ్యర్థాలు వేయటంవల్ల చేపలు ఇతర జలచరాలు చనిపోతున్నాయి. వర్షపు నీరు భూగర్భంలోకి చేరకుండా ప్లాస్టిక్‌ వ్యర్థాలు అడ్డుపడ్తున్నాయి. పాలిథిన్ బ్యాగులు, ఇతర ప్లాస్టిక్‌ వస్తువులను తగలబెట్టడం వల్ల డ్రైయాక్సిన్‌ విషవాయువు గాలిలో కలిసి పలు రకాల క్యాన్సర్‌ లకు కారణమవుతుంది. వాతావరణంలో కాలుష్యం ఏర్పడటానికి ప్రధాన కారణం విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం అని తెలిసినా, వాటికి ప్రత్యమ్నాయ మార్గాలు ఉన్నా మనలో నిర్లక్ష్య ధోరణి వదలడం లేదు. ప్రభుత్వాలు 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించినా అమలుకు మాత్రం నోచుకోవడం లేదు.

ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించే దిశగా ప్రతి ఒక్కరు చూడాలి. పాలిథిన్ క్యారీ బ్యాగులకు బదులుగా క్లాత్ బ్యాగులను వాడుకోవాలి. జనపనార, కాగితంతో తయారైనవి కూడా ఉత్తమమే.
 

No comments: